News March 16, 2025

PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.

Similar News

News February 16, 2026

10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. అనంతపురం డివిజన్‌లో 46, హిందూపురం డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470

News February 16, 2026

ఐఐటీ గువాహటిలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

image

<>IIT <<>>గువాహటి 10 జూనియర్ ఇంజినీర్(ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిప్లొమా (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. నెలకు స్టైపెండ్ రూ.25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iitg.ac.in/

News February 16, 2026

అడుగడుగునా ఆటంకాలా.. ఏం చేయాలంటే?

image

కష్టపడినా ఫలితం లేకపోతే కొన్ని పరిహారాలతో ఆటంకాలను అధిగమించవచ్చని పండితులు సూచిస్తున్నారు. ‘బయటకు వెళ్తే హనుమాన్ మంత్రాన్ని జపించాలి. చెడు దృష్టి తొలగుతుంది. కాకులకు గింజలు పెడితే శని, రాహు, కేతు దోషాలు తగ్గుతాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. వినాయకుడి స్మరణ కూడా చాలా మంచిది. దీనివల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ మార్పులు వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అద్భుత పురోగతిని, ఆనందాన్ని ప్రసాదిస్తాయి’ అంటున్నారు.