News March 16, 2025
PPM: మూడు అంబులెన్స్లను అందించిన NPCI

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్లను అందించారు. ఈ అంబులన్స్లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.
Similar News
News September 17, 2025
నిజాంసాగర్: దిగువకు 82 వేల క్యూసెక్కులు విడుదల

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహంతో నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి 82,056 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు, ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 57,268 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
News September 17, 2025
HYD: దుర్గా మాత విగ్రహ ప్రతిష్ఠకు ఆన్లైన్ నమోదు

సైబరాబాద్లో దుర్గామాత నవరాత్రి వేడుకలకు విగ్రహ ప్రతిష్ఠకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. భక్తులు, యువకులు, మండపాల నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని తెలిపారు. అనుమతులు పొందిన తర్వాతే మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.
News September 17, 2025
ASF: రక్తదానం చేసి ప్రాణదాతలు కండి: బీజేపీ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో రక్తం అవసరం పడుతుందన్నారు. జీవితంలో ఒక్కసారి అయినా రక్తదానం చేయాలని అన్నారు.