News February 6, 2025
PPM: వీడీవీకెలను బలోపేతం చేయాలి- కలెక్టర్
మన్యం జిల్లాలో ప్రధానమంత్రి వన్ ధన్ వికాస కేంద్రాల (వీడీవీకే) కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి పార్వతీపురం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 68, సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 54 వీడీవీకెలు ఉన్నాయి.
Similar News
News February 6, 2025
GWL: పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి.!
గ్రామీణ ప్రాంతాల పిల్లల భద్రత, పోషణ, ఆరోగ్యం, విద్యా భివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పోషణ, సాధికారిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ఐడిఓసి సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలను బలోపేతం చేయడం ద్వారా పిల్లల సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు.
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ
AP: సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.
News February 6, 2025
BREAKING: భారత్ విజయం
ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.