News March 11, 2025

PPM: జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటన

image

జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు పర్యటిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె. హేమలత అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. ఆయన బుధవారం రాత్రికి జిల్లాకు చేరుకొని, బస వేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరు అవుతారని ఆమె తెలిపారు.

Similar News

News March 12, 2025

భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News March 12, 2025

MBNR: LRS రాయితీ.. ఫోన్ చేయండి.!

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25% రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర ఓ ప్రకటనలో తెలిపారు. సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542-241165, జిల్లా నగర పాలక సంస్థలో హెల్ప్ లైన్ నంబర్ 7093911352 (ఉ.10 గంటల-సా.6 గంటల వరకు)కు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 12, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్?

image

హోలీ పండగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో DA(డియర్‌నెస్ అలవెన్స్), DR(డియర్‌నెస్ రిలీఫ్)పై ప్రకటన జారీ చేసే అవకాశముంది. ఇదే జరిగితే 1.2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. కాగా గత ఏడాది జులైలో DAను 50% నుంచి 53శాతానికి కేంద్రం పెంచింది. ఈ సారి 2శాతం పెరుగుతుందని అంచనా.

error: Content is protected !!