News March 28, 2025
PPM: ‘శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలి’

జిల్లాలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఉగాది వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో స్థానిక లయన్స్ కళ్యాణ మండపం వేదికగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.
Similar News
News December 22, 2025
ప్రజల్లోకి KCR.. దళపతి ముందు 2 సవాళ్లు

AP నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి. మొదటిది కూతురు కవిత.. తనపై తప్ప KTR సహా BRS ముఖ్య నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమెపై, ప్రత్యర్థుల ప్రశ్నలపై ఏమంటారు? అటు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదని CM రేవంత్ విమర్శిస్తున్నారు. బయటకు వస్తున్న మాజీ సీఎం సభలోకీ వస్తారా? అనేది ఛాలెంజ్2.
News December 22, 2025
ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం సమీక్షించారు. ఆప్షన్-3, PMAY 1.0 ఇళ్ల నిర్మాణాల్లో అజయ్ వెంచర్స్, పల్లా ఏసుబాబు, జి.వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సత్వరమే లబ్ధిదారులకు అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తేదారులను హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 22, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


