News September 12, 2025

అభివృద్ధి కోసమే PPP మోడల్స్: CM చంద్రబాబు

image

AP: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరముందని CM చంద్రబాబు Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘అభివృద్ధి కోసమే PPP మోడల్స్ అనుసరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవే అమలవుతున్నాయి. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పథకాలు అమలు చేసే శక్తి వస్తుంది. అందుకే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం’ అని తెలిపారు.

Similar News

News March 16, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.

News March 16, 2026

CNG సరఫరాలో కొరత లేదు: కేంద్రం

image

దేశంలో ఇంధన లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా సాఫీగా సాగుతోందని స్పష్టం చేసింది. దేశంలో క్రూడ్ ఆయిల్ సరిపడా ఉందని.. రిఫైనరీలు అన్నీ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయంది. పెట్రోల్ పంప్స్‌లో ఎలాంటి కొరత లేదని పేర్కొంది. దేశానికి శివాలిక్, నందాదేవి నౌకల ద్వారా మరో 92,712 టన్నుల LPG రానున్నట్లు తెలిపింది.

News March 16, 2026

భారత్‌కు ఆయిల్ తేవడమే టార్గెట్.. యుద్ధంలోనూ తగ్గేదేలే!

image

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నా భారతీయ నౌకలు క్రూడ్‌తో దేశానికి సేఫ్‌గా తిరిగొస్తున్నాయి. తాజాగా జగ్ లాడ్కి అనే నౌక సాహసోపేతంగా వార్ జోన్‌ను దాటేసింది. UAEలోని ఫుజైరా పోర్టుపై శనివారం దాడి జరిగినప్పుడు ఈ నౌక చమురు నింపుకుంటోంది. అయినా 80,800 టన్నుల ముర్బాన్ క్రూడ్ లోడ్ చేసుకొని నిన్న తిరుగుప్రయాణమైంది. కాగా 92,712 టన్నుల LPGతో శివాలిక్, నందాదేవి అనే నౌకలు కూడా భారత్‌ చేరుకోనున్నాయి.