News November 13, 2024

ఒక్కటవుతున్న పాక్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు

image

పాకిస్థాన్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు ఇయాజ్, లారెన్ ఒక్కటవుతున్నారు. వీరిద్దరూ ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. ‘రెండు వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు ప్రభాస్ వీరాభిమానులు కలిసి తమ జీవితాలను ఆస్వాదించబోతున్నారు. లారెన్ కోసం సప్త సముద్రాలను దాటొచ్చా’ అని ఇయాజ్ ట్వీట్ చేశారు. కాగా ప్రభాస్ ఫ్యాన్స్ వీరికి విషెస్ చెబుతున్నారు.

Similar News

News September 16, 2025

‘ఆరోగ్యశ్రీ’ బంద్.. చర్చలకు అంగీకరించని సర్కార్

image

TG: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇప్పటికే ₹140 కోట్ల బకాయిల్లో ₹100 కోట్లు విడుదలయ్యాయి. 150 కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతాయి. ఎమర్జెన్సీ సేవలు అందుతాయి. మిగతా 330 చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయి’ అని హెల్త్ మినిస్టర్ కార్యాలయ అధికారి Way2Newsకు తెలిపారు.

News September 16, 2025

విషాదం.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

image

AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్థిని నాగమణి(18) హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితులతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. వారితో మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారు.

News September 16, 2025

ఇంట్లో శంఖం ఉంచవచ్చా?

image

ఇంట్లో శంఖం ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ‘శంఖం ఊదడం వల్ల పాపాలు నశిస్తాయి. వాస్తు దోషాలు తొలగి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి, విష్ణువులకు శంఖం ప్రియమైంది. ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోనే ఉంటుంది. శంఖం ఊదడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి’ అని అంటున్నారు.