News September 27, 2024

మళ్లీ రామాయణంలో ప్రభాస్..?

image

ఆదిపురుష్‌లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి రామాయణంలో నటించనున్నారని బీటౌన్ వర్గాలంటున్నాయి. ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్‌లో రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో పరశురాముడి రోల్‌లో ప్రభాస్‌ నటించనున్నారని సమాచారం. ఆ మూవీలో ప్రధాన పాత్రల గురించి పలు ప్రచారాలు నడుస్తుండగా, అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News September 27, 2024

MBBS కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

image

TG: రాష్ట్రంలో MBBS ప్రవేశాల కోసం వెబ్‌ఆప్షన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ రోజు ఉ.6గంటల నుంచి ఈ నెల 29వ తేదీ సా.6గంటలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కన్వీనర్ కోటా కింద దివ్యాంగులు, EWS, PMC, సైనిక ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల కోసం tspvtmedadm.tsche.inను సందర్శించాలి.

News September 27, 2024

₹10,000 కోట్లతో స్విగ్గీ IPO

image

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ గురువారం సెబీ వద్ద IPO పేపర్లను సబ్మిట్ చేసింది. ₹10వేల కోట్ల విలువతో వస్తోంది. పేటీఎం (₹18,300 కోట్లు) తర్వాత భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్ IPO ఇదే. వచ్చే వారం షేర్‌హోల్డర్ల మీటింగ్ తర్వాత ఈ విలువను ₹11,700 కోట్లకు పెంచుతారని అంచనా. ఫ్రెష్ ఇష్యూ ద్వారా ₹3750 కోట్లు, OFS ద్వారా మిగిలిన డబ్బును సమీకరిస్తారు. స్విగ్గీ రైవల్ జొమాటో ₹9,375 కోట్లతో IPOకు వచ్చింది.

News September 27, 2024

నేడు ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రారంభం

image

TG: విదేశాల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా HYDలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కోసం ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్య ఒక వారధిలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.