News November 12, 2024

‘ఘాటీ’ సెట్‌లో అనుష్కను కలిసిన ప్రభాస్?

image

రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అయితే, సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ తరచూ కలుస్తుంటారని సినీవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా అనుష్క నటిస్తోన్న ‘ఘాటీ’ మూవీ సెట్స్‌కి కూడా ప్రభాస్ వెళ్లినట్లు తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో ‘భాగమతి’ మూవీ సెట్‌లోనూ వీరిద్దరూ కలుసుకున్నట్లు వెల్లడించాయి.

Similar News

News November 25, 2025

విషతుల్యమవుతున్న తల్లిపాలు

image

తల్లిపాలు స్వచ్ఛమైనవి, కల్తీలేనివని మనం అనుకుంటాం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్ అవశేషాలున్నట్లు గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా బిహార్‌లో చేసిన ఓ పరిశోధనలో తల్లిపాలలో యురేనియం అవశేషాలున్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే మానవ మనుగడే కష్టం అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా మేలుకొని పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

News November 25, 2025

ఇవాళ ఉదయం 10 గంటలకు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా(రూ.300)ను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేయనుంది. టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని TTD తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News November 25, 2025

‘MTU 1426’ వరి వంగడం ప్రత్యేకతలు

image

‘MTU 1426’ వరి వంగడాన్ని MTU 1121, NLR 34449 రకాలను సంకరం చేసి అభివృద్ధి చేశారు. బియ్యం పారదర్శకంగా, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకానికి గింజ రాలడం బాగా తక్కువ. గింజలు చేనుపై మొలకెత్తవు. అన్నం మృదువుగా ఉండి తినడానికి అత్యంత అనుకూలం. అగ్గితెగులు, ఎండాకు తెగులు, ఉల్లికోడును కొంత మేర తట్టుకుంటున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.