News February 13, 2025
ప్రభాస్ న్యూ లుక్ అదిరిందిగా..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739427998037_746-normal-WIFI.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమాలో తాను నటిస్తున్నట్లు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. డార్లింగ్, డైరెక్టర్తో దిగిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రభాస్ లుక్ రివీల్ కాలేదు. ఫొటోలో సైడ్ క్రాఫ్ హెయిర్ స్టైల్తో ట్రిమ్మ్డ్ బియర్డ్తో ఫార్మల్ డ్రైస్లో డార్లింగ్ కనిపించారు. ప్రభాస్ లుక్ బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Similar News
News February 13, 2025
మార్చి 31న బ్యాంకులకు సెలవు లేదు: RBI
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720740910-normal-WIFI.webp)
మార్చి 31వ తేదీన దేశంలోని బ్యాంకులకు సెలవు రద్దు చేస్తూ RBI నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో RBI ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మార్చి 31న సెలవు ఇస్తే లావాదేవీలన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని బ్యాంకులు ఆ రోజు పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News February 13, 2025
చిరంజీవి మనవడి కామెంట్స్పై SKN ట్వీట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739441018602_746-normal-WIFI.webp)
తనకు ఒక మనవడు కావాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పడంలో తప్పేముందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్మాత SKN దీనిపై ట్వీట్ చేశారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా అని ఊరికే అవాకులు చెవాకులు పేలటం, అనవసరంగా రాద్ధాంతం చేసి శునకానందం పొందడం కొందరికి అలవాటు’ అని పేర్కొన్నారు.
News February 13, 2025
16న ఢిల్లీ సీఎం ఎంపిక?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439851990_695-normal-WIFI.webp)
UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.