News March 17, 2024
నంబర్ 1 స్థానంలో ‘ప్రజాగళం’ ట్రెండింగ్!

AP: చిలకలూరిపేటలో ఎన్డీయే కూటమి ‘ప్రజాగళం’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగించారు. కాగా.. సోషల్ మీడియాలో ప్రజాగళం హ్యాష్ ట్యాగ్ అగ్రస్థానంలో ట్రెండ్ అయింది. 67వేలకు పైగా పోస్టులు ట్విటర్లో వచ్చాయి. ఏపీ వెల్కమ్స్ మోదీ, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండింగ్ అయ్యాయి.
Similar News
News October 15, 2025
ముందస్తు బెయిల్ పిటిషన్లపై అమికస్ క్యూరీ నివేదిక

ముందస్తు బెయిళ్లపై సెషన్స్ కోర్టులకే ప్రాధాన్యముండాలని సిద్ధార్థ్ లూథ్రా, అరుద్ర రావులతో కూడిన అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించింది. ప్రత్యేక స్థితుల్లోనే HIGH COURTS వాటిని అనుమతించాలంది. నిందితుడి నివాసం సెషన్ కోర్టు పరిధిలో లేనపుడు, అల్లర్లు వంటి సమస్యలపుడు, అనారోగ్యం ఇతర కారణాలతో సెషన్స్ కోర్టును ఆశ్రయించలేనపుడు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని నివారించాల్సినపుడు మాత్రమే తీసుకోవాలంది.
News October 15, 2025
పెళ్లి కన్నా డేటింగే బాగుంది: ఫ్లోరా సైనీ

తాను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయినట్లు నటి, బిగ్ బాస్-9 కంటెస్టెంట్ ఫ్లోరా సైనీ(ఆశా సైనీ) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్తో డీప్ డేటింగ్లో ఉన్నట్లు చెప్పారు. పెళ్లి చేసుకొని విడిపోవడం కన్నా డేటింగ్ చేస్తూ లైఫ్ను ఎంజాయ్ చేయడమే బెటర్ అనిపిస్తోందన్నారు. అందుకే పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఫ్లోరా తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ తదితర చిత్రాల్లో నటించారు.
News October 15, 2025
పసుపులో ముర్రాకు తెగులు, దుంపకుళ్లు.. నివారణ

అక్టోబర్లో వాతావరణ పరిస్థితులకు పసుపు పంటలో ముర్రాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. అందుకే తెగులు ఆశించిన ఆకులను తుంచి కాల్చివేయాలి. థయోఫానైట్ మిథైల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. అలాగే దుంపకుళ్లు నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్+మ్యాంకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లను తడపాలి.