News March 17, 2024

నిజామాబాద్, కామారెడ్డిలో ప్రజావాణి రద్దు

image

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు జి.వి పాటిల్, రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆయా కలెక్టర్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సహకరించాలని సూచించారు.

Similar News

News September 3, 2025

NZB: నగర పాలక సంస్థలో ACB దాడులు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థలో బుధవారం ACB అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ పండ్ల దుకాణానికి అనుమతి కోసం రూ.7 వేలు లంచం డిమాండ్ చేసిన RI శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ జవాన్ ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 3, 2025

జాతీయస్థాయి పోటీలకు NZB క్రీడాకారులు

image

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లాకి చెందిన ఇద్దరు క్రీడాకారులు నేహాల్ అఫ్సర్, ఐశ్వర్య ఎంపికయ్యారని జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బిలి నరేష్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు లూథియానా(పంజాబ్)లో ఈనెల 2 నుంచి నుంచి 9 వరకు జరిగే 75వ జూనియర్ నేషనల్స్‌లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

News September 3, 2025

SRSP UPDATE.. 29 గేట్ల నుంచి నీటి విడుదల

image

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 29 వరద గేట్ల ద్వారా లక్షా 51 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4500, ఎస్కెప్ గేట్ల ద్వారా 3500, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది.