News March 17, 2024
నిజామాబాద్, కామారెడ్డిలో ప్రజావాణి రద్దు

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు జి.వి పాటిల్, రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆయా కలెక్టర్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సహకరించాలని సూచించారు.
Similar News
News January 26, 2026
దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపేందుకు అందరు సహకారం అందించాలన్నారు.
News January 26, 2026
నిజామాబాద్: కొందరికే భరోసా

భూమిలేని నిరుపేద కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో గతేడాది ఇదే రోజు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ప్రారంభించింది. నిజామాబాద్ జిల్లాలో 38,787 మందిని లబ్ధిదారులుగా గుర్తించగా కేవలం 1,675 మందికే తొలి విడత సాయం అందింది. ఇంకా 37,112 మంది ఎదురుచూస్తున్నారు. ఏడాది గడిచినా నిధులు విడుదల కాకపోవడంతో అర్హులైన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News January 26, 2026
రిపబ్లిక్ డే వేడుకకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


