News March 17, 2024
లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు

లోక్ సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమైనందున ఎన్నికల ప్రక్రియలు కొనసాగిస్తారన్నారు. ఎన్నికలు నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కలికంగా రద్దు చేస్తున్నామన్నారు.
Similar News
News February 15, 2026
హుజురాబాద్ : నీళ్లు లేని ఫైర్ ఇంజన్… కళ్లముందే ఇల్లు బూడిద!

హుజూరాబాద్లోని మారుతినగర్లో షార్ట్ సర్క్యూట్తో రిఫ్రిజిరేటర్ పేలి ఇల్లు దగ్ధమైంది. అద్దెకు ఉంటున్న దాసారపు మధునమ్మ ఇంట్లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. గూన పెంకుల ఇల్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. హుజురాబాద్ ఫైర్ ఇంజన్లో ప్రారంభంలోనే నీరు లేకపోవడం విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి జమ్మికుంట ఫైర్ ఇంజన్ వచ్చి స్థానికుల సహాయం తో మంటలు అదుపులోకి తెచ్చినా భారీ ఆస్తి నష్టం జరిగింది.
News February 15, 2026
కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.
News February 14, 2026
KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.


