News March 17, 2024
ప్రకాశం: నేటి నుంచి స్పందన కార్యక్రమం రద్దు

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాతోపాటు మండలాల్లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలోనూ కోడ్ అమలులోకి వచ్చిందని, అందువల్ల స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News January 7, 2026
జగన్పై మంత్రి స్వామి విమర్శలు

పబ్లిసిటీ పిచ్చితో పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేసుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి స్వామి విమర్శించారు. కొండపి మండలం తాటాకులపాలెంలో ఆయన బుధవారం పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రికార్డులను తారుమారు చేయడానికి వీలులేని విధంగా కొత్తపాస్ పుస్తకాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రతి దశలో అన్నదాతకు అండగా ఉంటున్నామన్నారు.
News January 7, 2026
9న ఒంగోలులో జాబ్ మేళా..రూ.22వేల శాలరీ!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 18 నుంచి 30ఏళ్ల మధ్యగల యువతీ, యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. 10 నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, నియమితులైనవారికి 22వేల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు.
News January 7, 2026
రామాయపట్నం పోర్టు పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష

గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలో అధికారులతో సమావేశమైన ఆయన ప్రస్తుత పనుల పురోగతి, భూసేకరణ స్థితిగతులపై ఆరా తీశారు. డ్రెడ్జింగ్, బెర్త్ వర్క్స్, ఆన్షోర్ వర్క్స్, రైల్వే లైన్ నిర్మాణం, రోడ్డు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు.


