News March 17, 2024
ప్రకాశం: గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

రేపు నిర్వహించనున్న గ్రూప్ -1 స్క్రీనింగ్ టెస్ట్కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 9 కేంద్రాల్లో మొత్తం 6,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష రోజున జిల్లా వ్యాప్తంగా సెక్షన్-30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు.
Similar News
News January 6, 2026
ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.
News January 5, 2026
కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News January 5, 2026
కనిగిరి వద్ద మహిళ దారుణ హత్య.!

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టామని మరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని SI కృష్ణ పావని తెలిపారు. హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


