News March 17, 2024

ప్రకాశం: గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

image

రేపు నిర్వహించనున్న గ్రూప్ -1 స్క్రీనింగ్ టెస్ట్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 9 కేంద్రాల్లో మొత్తం 6,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష రోజున జిల్లా వ్యాప్తంగా సెక్షన్-30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు.

Similar News

News September 2, 2025

ప్రకాశం: పవన్ బర్త్ డే.. పోటాపోటీగా కేక్ కటింగ్స్!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన నాయకులు పోటాపోటీగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఇతర నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. అయితే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన ఇంటిలో నెల్లూరు జనసేన నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.

News September 2, 2025

జాన్ వెస్లీకి నివాళులర్పించిన ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని చర్చి కూడలి వద్ద గల జాన్ వెస్లీ ఐపీఎస్ విగ్రహానికి మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. YSR భద్రతా అధికారిగా విధులు నిర్వహించిన జాన్ వెస్లీ హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్సార్‌తోపాటు ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జాన్ వెస్లీ 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ నివాళులు అర్పించారు.

News September 2, 2025

ప్రకాశం జిల్లాలో మెరుపు దాడులు.!

image

ప్రకాశం జిల్లాలో ఎరువుల కేంద్రాలపై, యూరియా నిల్వలపై పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా SP దామోదర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. సాయంత్రానికి తనిఖీల ద్వారా షాపులపై చర్యలు తీసుకుంటారా అన్నది పోలీస్ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ తనిఖీల్లో DSPలు, CIలు, SIలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.