News July 28, 2024
ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ

బిహార్లో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు రాజకీయ వ్యూహకర్త, I-PAC ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ప్రస్తుతం ‘జన్ సురాజ్’ పేరుతో ఆయన ఓ క్యాంపెయిన్ నడుపుతున్నారు. దానినే పొలిటికల్ పార్టీగా మారుస్తున్నట్లు పీకే పేర్కొన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘జన్ సురాజ్’ పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో JDU అధినేత, సీఎం నితీశ్ కుమార్ను ఢీకొడతామన్నారు.
Similar News
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.
News December 1, 2025
రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


