News September 27, 2024

నేడు ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రారంభం

image

TG: విదేశాల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా HYDలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కోసం ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్య ఒక వారధిలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News

News September 27, 2024

KKR మెంటార్‌గా డ్వేన్ బ్రావో

image

వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. కానీ, ఐపీఎల్‌-2025లో మెంటర్‌గా తిరిగి తన మార్క్‌ను చూపేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా బ్రావోను నియమిస్తున్నట్లు KKR తెలిపింది. గత సీజన్‌లో మెంటార్‌గా ఉన్న గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వెళ్లారు. ఆయన స్థానంలో జట్టు గెలుపు కోసం బ్రావో కృషి చేయనున్నారు.

News September 27, 2024

IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్?

image

IPL-2025లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచేది లేదని BCCI తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి 74 మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా వచ్చే సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఆడించాలని గతంలో BCCI యోచించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

News September 27, 2024

జగన్ తిరుపతి పర్యటన.. కూటమి కీలక నిర్ణయం

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.