News May 20, 2024
ఇబ్రహీం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: మోదీ

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తు సమయంలో ఇరాన్ ప్రజలకు తాము సంఘీభావంగా నిలుస్తామన్నారు. అధ్యకుడు ఇబ్రహీం, అతనితో పాటు ఉన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా ఇబ్రహీం అజర్బైజాన్ పర్యటనకు వెళ్తుండగా జోల్పా సిటీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై PM మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై AP Dy.CM పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు విజ్ఞప్తి చేశారు.
News October 24, 2025
కంట్రోల్ రూమ్స్ నంబర్లు ఇవే

AP: కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు.
☞ కలెక్టరేట్లో: 08518-277305
☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి: 9121101059
☞ ఘటనా స్థలి వద్ద: 9121101061
☞ కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం: 9121101075
☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:
9494609814, 9052951010
★ బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
News October 24, 2025
ఈ నెల 29న మెగా జాబ్మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు(D) నరసరావుపేటలోని ఈశ్వర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, ఫార్మసీ, డిగ్రీ, ఇంజినీరింగ్, MBBS, PG అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 – 35ఏళ్ల మధ్య ఉండాలి. ఈ జాబ్మేళాలో 34 MNC కంపెనీలు పాల్గొంటున్నాయి. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/


