News May 20, 2024

ఇబ్రహీం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: మోదీ

image

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తు సమయంలో ఇరాన్ ప్రజలకు తాము సంఘీభావంగా నిలుస్తామన్నారు. అధ్యకుడు ఇబ్రహీం, అతనితో పాటు ఉన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా ఇబ్రహీం అజర్‌బైజాన్‌ పర్యటనకు వెళ్తుండగా జోల్పా సిటీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Similar News

News December 4, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.

News December 4, 2025

క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్: భట్టి

image

TG: క్వాంటం ఎకానమీ లీడర్‌ కావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ స్కిల్స్ హైదరాబాద్‌లో ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్ సహా తదితర అంశాలపై దృష్టిసారించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

News December 4, 2025

వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

image

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.