News September 20, 2025

పాడి పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

image

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.

Similar News

News September 20, 2025

ట్రంప్ నిర్ణయంతో భారతీయుల ఉద్యోగాలు పోతాయ్: కాంగ్రెస్

image

US H-1B వీసా ఫీజులు పెంచడంతో భారత్ చాలా నష్టపోతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘మోదీ ఫ్రెండ్ ట్రంప్ ₹6లక్షలుగా ఉన్న H-1B వీసా ఫీజును ₹88లక్షలకు పెంచారు. దీని వల్ల ఇండియన్స్‌కు USలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి INDకు వచ్చే మనీ తగ్గుతుంది. ఇక్కడి IT ఉద్యోగుల జాబ్స్ రిస్క్‌లో పడతాయి. మోదీ ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది’ అని పేర్కొంది.

News September 20, 2025

మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

image

మనిషికి ఆల్కహాల్‌తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.

News September 20, 2025

ఎర్లీ మెనోపాజ్‌లో ఏం తినాలంటే..

image

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.