News September 16, 2024
వరద ప్రభావిత ప్రజలకు జాగ్రత్తలు

AP: విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు చేసింది. ‘వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. కాచి, చల్లార్చి, వడపోసిన నీరే తాగాలి. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి. అత్యవసరమైతే 108కి ఫోన్ చేయండి’ అని సూచించింది.
Similar News
News January 8, 2026
జగన్ రాజధాని కామెంట్లపై మంత్రి కౌంటర్

AP: రాజధాని అమరావతిపై జగన్ మరోసారి విషం కక్కుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. కేంద్రం, ఆర్థిక సంస్థలకు తెలియని విషయాలు తెలుసా అని నిలదీశారు. ‘అమరావతిపై తప్పుగా అర్థం చేసుకున్నామని అధికారం కోల్పోయాక జగన్ అన్నారు. ఇప్పుడు CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటున్నారు. నదీ గర్భంలో ఉందంటున్నారు. జగన్ హయాంలోనే రూ.12,700కోట్లు ట్రూఅప్ ఛార్జీలు వేయాలని డిస్కమ్లు ప్రతిపాదించాయి’ అని పార్ధసారథి చెప్పారు.
News January 8, 2026
ఇతిహాసాలు క్విజ్ – 121 సమాధానం

ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు కావడానికి గల కారణం ఏంటి?
సమాధానం: హస్తినాపుర వంశాభివృద్ధి కోసం వ్యాసమహర్షి అంబిక వద్దకు వెళ్లారు. ఆయన తపశ్శక్తితో కూడిన భయంకర రూపాన్ని చూసి అంబిక భయంతో కళ్లు మూసుకుంది. తల్లి చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల, ఆమెకు పుట్టిన కుమారుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు. ఆమె కళ్లు మూసుకోవడమే అతడి దృష్టిలోపానికి ప్రధాన కారణమైంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 8, 2026
ప్రసారభారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


