News October 11, 2025

పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు

image

పిచికారీకి ముందు పురుగు మందు డబ్బాలపై సూచనలను తప్పక చదవాలి. ఇంటి పరిసరాలకు, చిన్న పిల్లలకు, పశువులకు పురుగు మందు డబ్బాలను దూరంగా ఉంచాలి. ఎండగా ఉన్నప్పుడే పురుగు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ సమయంలో తప్పనిసరిగా చేతికి గ్లౌజ్, ముఖానికి మాస్క్, టోపీ, ఆప్రాన్ లాంటి శరీరమంతా కప్పుకునే బట్టలు వేసుకోవాలి. గాలి వీచే దిశలో మాత్రమే పిచికారీ చేయాలి. వర్షం పడేలా ఉంటే పురుగు మందులను పిచికారీ చేయకూడదు.

Similar News

News October 11, 2025

కల్తీ కాఫ్ సిరప్‌లపై US ఆరా

image

మన దేశంలో 22 మంది పిల్లల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందులపై US ఆరా తీసింది. కోల్డ్రిఫ్ సిరప్ అమెరికా సహ ఏ దేశానికీ పంపలేదని US FDAకు CDSCO (IND) తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది. పరిమితికి మించి 500 రెట్ల విషపూరితమైన కాఫ్ సిరప్ వల్ల పిల్లలు మరణించారని తెలిపింది. ‘ఆ మందులు USలోకి రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడకి వచ్చే మందులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని చెప్పాం’ అని FDA పేర్కొన్నట్లు వివరించింది.

News October 11, 2025

బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్‌ పల్లా శ్రీనివాస్‌ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్‌ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.

News October 11, 2025

విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు

image

ఒడిశా విద్యార్థినిపై <<17976156>>అత్యాచారం <<>> కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని WB సీఎం మమతను కోరారు.