News July 9, 2024
కొత్త పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయండి: మంత్రి సీతక్క

TG: రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. BRS ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.
Similar News
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <
News November 27, 2025
నటిని పెళ్లి చేసుకున్న మాజీ క్రికెటర్

తమిళ బిగ్బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముఘనాథన్ను మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, IPL మాజీ ప్లేయర్ అనిరుద్ధ శ్రీకాంత్ వివాహమాడారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. సంయుక్త నటిగా, మోడల్గా గుర్తింపు పొందగా.. అనిరుద్ధ IPLలో 2008 నుంచి 14 వరకూ CSK, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.


