News January 29, 2025

FEB 10లోగా కొత్త టూరిజం పాలసీ రెడీ చేయండి: సీఎం

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా అత్యుత్తమ పాలసీ రూపొందించాలన్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర సమయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్త ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జాతర సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ సర్క్యూట్‌ అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

Similar News

News October 16, 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!

image

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లుగా ఉంది.

News October 16, 2025

అఫ్గాన్‌కు భారత్ సపోర్ట్.. పాక్‌కు చావుదెబ్బ!

image

‘శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు’ అని చాణక్యుడు చెప్పారు. TTP అధినేతను హతమార్చేందుకు పాక్ అటాక్ చేయడంతో అఫ్గాన్ యుద్ధానికి దిగింది. దీంతో ఆ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారాయి. భారత్ రెచ్చగొట్టడం వల్లే అఫ్గాన్ తమపై దాడులు చేస్తోందని పాక్ పసలేని వాదనలు చేస్తోంది. తమ దేశాన్ని చక్కబెట్టుకోలేక మనపై ఏడుస్తోంది. ఈ క్రమంలో భారత్.. అఫ్గాన్‌కు <<18023858>>సపోర్ట్<<>> చేస్తున్నట్లు ప్రకటించి పాక్‌ను చావుదెబ్బ తీసింది.

News October 16, 2025

మహిళలకు చోటిస్తేనే..

image

ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే మహిళలకు నిర్ణయ శక్తి ఇవ్వాలని ప్రపంచ ఆహార సంస్థ చెబుతోంది. వారికి భూమి హక్కులు, రుణ సౌకర్యాలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు అందించడం ద్వారా ఆహార ఉత్పత్తి, నిల్వ, పంపిణీ వ్యవస్థలు బలోపేతం అవుతాయి. ఆకలి, పేదరికం, పోషకాహార లోపం తగ్గుతాయి. ఆహార భద్రతను సాధించడానికి ప్రభుత్వాలూ, NGOలతో కలిసి అందులో మహిళలకుచోటు కల్పించాలంటోంది ప్రపంచ ఆహార సంస్థ.