News April 12, 2024

యుద్ధానికి సిద్ధంగా ఉండండి: కిమ్

image

మునుపెన్నడూ లేని విధంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ సైన్యానికి పిలుపునిచ్చారు. దేశంలోని సైనిక వర్సిటీని సందర్శించిన సందర్భంగా ఈమేరకు స్పష్టం చేశారు. ‘శత్రువులు మనల్ని రెచ్చగొడితే చావు దెబ్బ తీయాలి. కేవలం సిద్ధంగా ఉండటమే కాదు. విజయాన్ని సాధించాలి. అందుకోసం అన్ని వనరుల్ని వినియోగించుకుందాం’ అని సూచించారు.

Similar News

News January 16, 2026

రూ.238కోట్లు కలెక్ట్ చేసిన ‘రాజాసాబ్’

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ.238కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ సైజ్ బ్లాక్‌బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు.

News January 16, 2026

ట్యాపింగ్ కేసు.. ఇంకెంతకాలం విచారిస్తారు: సుప్రీం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు విచారణకు గడువు ఇప్పటికే పూర్తయిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది.

News January 16, 2026

ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటిన BJP కూటమి

image

BMC ఎన్నికల కౌంటింగ్‌లో BJP+ దూసుకుపోతోంది. ఏక్‌నాథ్ షిండే శివసేనతో కూడిన కూటమి మెజారిటీ మార్కును (114) దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 115 వార్డుల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి 77 వార్డుల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక తమ కంచుకోట పుణే, పింప్రి చించ్వివాడ్‌లో ‘పవార్’ల పట్టు సడలినట్లు కనిపిస్తోంది. ఇక్కడ కూడా BJP హవానే కొనసాగుతోంది.