News October 20, 2024
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం.. కానీ: జూడాలు
బెంగాల్లో జూడాలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే తమ నిరాహార దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. కోల్కతా లేడీ ట్రైనీ డాక్టర్ రేప్&మర్డర్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ వాళ్లు దీక్ష చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లలో చాలావరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమత అంటున్నారు. కాగా హెల్త్ సెక్రటరీని తొలగించేందుకు మాత్రం ఆమె ఒప్పుకోకపోవడంతో వివాదానికి ముగింపు పడట్లేదు.
Similar News
News October 21, 2024
పాక్ యువతిని పెళ్లాడిన బీజేపీ నేత కుమారుడు
ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ తహ్సీన్ షాహిద్ కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్, పాకిస్థాన్కు చెందిన ఆంద్లీప్ జారా అనే యువతిని ఆన్లైన్లో నిఖా చేసుకున్నారు. హైదర్కు వీసా లభించకపోవడం, అటు జారా తల్లి అనారోగ్యంతో ICUలో ఉండటంతో ఆన్లైన్లోనే పెళ్లి చేసుకున్నట్లు హైదర్ తెలిపారు. తన భార్యకు త్వరలోనే భారత వీసా లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 21, 2024
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం
TG: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న సమయంలో ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 21, 2024
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి కూతురు
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ టాలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. నటనతోనే కాకుండా తన వాయిస్తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు సత్య కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కుతున్న కేసీఆర్(కేశవచంద్ర రమావత్) చిత్రంలో అనన్య లీడ్ రోల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.