News September 21, 2024
జానీ మాస్టర్ భార్య అరెస్ట్కు రంగం సిద్ధం?
TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News September 21, 2024
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్
AP: గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మన రాష్ట్రంతో పాటు దేశానికీ చెడ్డ పేరు వచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదని చెప్పారు. YCP పాలనలో పారిశ్రామిక రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
News September 21, 2024
ఆ వివాదంలోకి కెనీషాను లాగొద్దు: జయం రవి
తమిళ నటుడు జయం రవి తన భార్యతో విడిపోవడం వెనుక గాయని కెనీషా ఫ్రాన్సిస్తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవి తాజాగా స్పందించారు. ‘దయచేసి ఇందులోకి ఎవరి పేరునూ లాగొద్దు. వ్యక్తిగత జీవితాల్ని గౌరవించండి. చాలామంది చాలా అంటున్నారు. కెనీషా 600కు పైగా స్టేజీ షోల్లో పాడిన గాయని. కష్టపడి పైకొచ్చింది. ఆమెను ఈ వివాదంలో దయచేసి ఇన్వాల్వ్ చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.
News September 21, 2024
ఇగ్నో అడ్మిషన్ల గడువు పొడిగింపు
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్కు సంబంధించి అన్ని ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్ల కోసం అడ్మిషన్ల గడువును పొడిగించింది. తాజాగా Sep 30, 2024 వరకు గడువు పెంచింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్స్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు అడ్మిషన్ల గడువు పెంచారు.