News November 16, 2024

మెగాసిటీకి తగ్గ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం: నారాయణ

image

AP ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గుంటూరులో ఓ ప్రాపర్టీ షో బ్రౌచర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ‘లేఔట్ అనుమతుల విషయంలో సడలింపులు తెస్తున్నాం. దేశంలోనే సరళతరమైన విధానాలు ఏపీలో తీసుకొస్తాం. రియల్ ఎస్టేట్ రంగానికి మా ప్రభుత్వం సహకరిస్తుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి కలిసి మెగాసిటీగా మారుతాయి. అందుకు తగ్గ మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది’ అని చెప్పారు.

Similar News

News November 19, 2025

NRPT: 3వ జిల్లా మహా సభలు విజయవంతం చేయాలి

image

జిల్లా కేంద్రంలో జరిగే PDSU జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. మహా సభల వాల్ పోస్టర్లను బుధవారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22, 23 రెండు రోజులు మహా సభలు జరుగుతాయని, విద్యార్థులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నేతలు పాల్గొన్నారు.

News November 19, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

image

భారత సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 513 పాయింట్లు పెరిగి 85,186.47(0.61%) వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 26,052.65(0.55%) వద్ద క్లోజ్ అయ్యింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పడిపోయింది. ఓవరాల్‌గా BSE లిస్టెడ్ కంపెనీలు రూ.474.6 లక్షల కోట్ల నుంచి రూ.475.6 లక్షల కోట్లకు చేరాయి. అంటే సింగిల్ సెషన్‌లోనే రూ.లక్ష కోట్లకు పైగా లబ్ధి పొందాయి.

News November 19, 2025

BREAKING: ఖాతాల్లో రూ.7,000 జమ

image

AP: పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని మోదీ TNలోని కోయంబత్తూరులో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమయ్యాయి. అటు కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో యాడ్ అయ్యాయి. మొత్తంగా రూ.7 వేల చొప్పున జమయ్యాయి.