News August 22, 2025

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టం కానుండగా, ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.కోటి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రూల్స్ ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.50లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు నివారించేలా కేంద్రం దీనిని తీసుకొచ్చింది.

Similar News

News March 26, 2026

రెడీగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.. జూన్ కల్లా మరో లక్ష: పొంగులేటి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి ప్రకటించారు. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని, ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయిస్తామన్నారు. ఇళ్ల ఎంపిక కోసం గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు అధ్యక్షులుగా ఉంటారని, ఇందులో MLAల ప్రాతినిధ్యంపై ఆలోచిస్తామని తెలిపారు.

News March 26, 2026

వరల్డ్ నంబర్ వన్ లీడర్ మోదీ: 68% రేటింగ్‌తో మళ్లీ టాప్!

image

USకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ లేటెస్ట్ సర్వే ప్రకారం 68% అప్రూవల్ రేటింగ్‌తో మోదీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్‌గా నిలిచారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ పార్మెలిన్, సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (62%) ఉన్నారు. US అధ్యక్షుడు ట్రంప్ (39%), బ్రిటన్ PM కీర్ స్టార్మర్ (24%) మోదీ కంటే వెనుకబడ్డారు. అలాగే నెహ్రూ తర్వాత అత్యధిక కాలం PMగా ఉన్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు.

News March 26, 2026

ట్రంప్ నరకం చూపిస్తారు: వైబ్ హౌస్

image

ఇరాన్ తన ఓటమిని అంగీకరించకపోతే ఆ దేశాన్ని ఘోరంగా దెబ్బకొడతామని అమెరికా హెచ్చరించింది. ట్రంప్ అస్సలు తగ్గరని.. నరకాన్ని చూపిస్తారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం నాలుగో వారంలో ఉండగా అగ్రరాజ్యం తన లక్ష్యాలకు చాలా దగ్గరలో ఉందని వెల్లడించింది. ఒకవైపు పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నా ఇరాన్ లొంగిపోవడమే మార్గమని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది.