News September 28, 2024

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి

image

TG: నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు HYD రానున్నారు. ఆమె పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నియమించింది. ముర్ముకు స్వాగతం పలకడం నుంచి ఆమె తిరిగి వెళ్లే వరకు సీతక్క రాష్ట్రపతి వెంటే ఉండనున్నారు. బేగంపేట, HPS, PNT జంక్షన్‌, రసూల్‌పురా, CTO ప్లాజా, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి.

Similar News

News September 28, 2024

ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు

image

TG: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పొడిగించింది. ప్రభుత్వ కళాశాలల్లో రూ.500 జరిమానాతో, ప్రైవేట్ కాలేజీల్లో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించింది. కాగా విద్యార్థులను చేర్పించే కాలేజీలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో? లేదో? గమనించుకోవాలని తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు సూచించింది.

News September 28, 2024

చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు: రోజా

image

AP: చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదని మాజీ మంత్రి రోజా దుయ్యబట్టారు. ఆయన షూ వేసుకునే పూజలు చేస్తారని అన్నారు. గతంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పిన పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఒకప్పుడు కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

News September 28, 2024

నేడు రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ MLAలు, MLCలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై సూచనలు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఢిల్లీ బయలుదేరుతారు.