News December 8, 2024
17న మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శీతాకాల విడిదిలో భాగంగా ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు.
Similar News
News November 20, 2025
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా?

AP: నిధులు జమకాని రైతులు annadathasukhibhava.ap.gov.in వెబ్సైట్లో Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. ఆధార్ నంబర్, పక్కన క్యాప్చా ఎంటర్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అందిన మొత్తం, తేదీ, ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. సక్సెస్ అంటే డబ్బు జమైందని అర్థం. Pending/Rejected అంటే ఇంకా జమ కాలేదు, నిరాకరించబడిందని అర్థం. మీకు ఏమైనా సందేహాలుంటే గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.
News November 20, 2025
405Kmph.. రికార్డులు బద్దలు కొట్టిన మెలిస్సా

కరీబియన్ దీవులను ధ్వంసం చేసిన <<18174610>>మెలిస్సా<<>> హరికేన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 252mph(405Kmph) వేగంతో విరుచుకుపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అత్యంత శక్తిమంతమైన హరికేన్ వేగమని NSF NCAR వెల్లడించింది. జమైకా వైపు దూసుకెళ్తున్న సమయంలో ఈ రికార్డు నమోదైంది. 2010లో తైవాన్ సమీపంలో టైఫూన్ మెగీ నమోదు చేసిన 248mph రికార్డును మెలిస్సా అధిగమించింది. దీని ప్రభావంతో 70 మందికిపైగా మృతి చెందారు.
News November 20, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్.. ఇవాళే లాస్ట్ డేట్

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్షిప్ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్సైట్ <


