News January 1, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్

నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.
Similar News
News January 6, 2026
విద్యుత్ సరఫరా నెట్వర్క్ పనులకు REC నిధులు

TG: విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి REC (Rural Electrification Corporation Limited) ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. తొలుత HYDలో భూగర్భ కేబుల్ నెట్వర్క్ అభివృద్ధికి ₹4000 కోట్లు ఇవ్వనుంది. DPR ఖరారు కావడంతో ఈ పనులకు టెండర్లను ఆహ్వానించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా ఇతర ప్రాంతాల్లోనూ REC నిధులతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపడతామని అధికారులు తెలిపారు.
News January 6, 2026
వారే నిజమైన హీరోయిన్.. అనసూయ ఆసక్తికర పోస్ట్

నిన్న హీరోయిన్ <<18770152>>రాశీకి<<>> క్షమాపణలు చెప్పిన నటి అనసూయ మరోసారి ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘హీరోయిన్ తెరపై కాదు. సత్యం మాట్లాడే ధైర్యం. సొంత దారిలో నడిచే శక్తి. సరైనదానికి నిలబడే గుండె. అదే నిజమైన హీరోయిన్. మిగతావాళ్లు కేవలం నటులే’ అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అని మరో చర్చ మొదలైంది. గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 6, 2026
BREAKING: విజయ్కు సీబీఐ నోటీసులు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.


