News March 26, 2024

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రపతి కుమార్తె?

image

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపాలని బీజేపీ భావిస్తోందట. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇతిశ్రీని పోటీకి నిలబెడితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరపతి కలిసివస్తుందని భావిస్తోందట. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే బీజేపీ అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

Similar News

News October 3, 2024

పడవ ప్రమాదం.. 60కి చేరిన మృతులు

image

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ నైజీర్‌ నదిలో మునిగిపోయింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 160 మందిని రక్షించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. పడవ పాతదని, ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా నైజర్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని, మృతులు పెరిగే అవకాశం ఉందన్నారు.

News October 3, 2024

తెలుగువారి కోసం Google కొత్త ఫీచర్

image

Gemini Live AI టూల్‌తో మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా సంభాషించవచ్చు. దేశంలో వాయిస్ అసిస్టెంట్ ఏఐ టూల్ వాడ‌కం పెరుగుతుండ‌డంతో Google దీన్ని మరిన్ని ప్రాంతీయ భాష‌లకు విస్తరించింది. ప్రస్తుతం ఇంగ్లిష్‌తోపాటు హిందీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని రోజుల్లో తెలుగు, త‌మిళం, మ‌లయాళం, బెంగాలీ, మ‌రాఠీ, ఉర్దూ భాషల్లో తీసుకురానుంది. ఈ ఏడాదితో దేశంలో Google 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

News October 3, 2024

సురేఖ‌పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

image

నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.