News July 30, 2024
5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వచ్చే నెల 5 నుంచి ఆరు రోజులపాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఫిజీ దేశానికి వెళ్లి అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 7 నుంచి 9 వరకు న్యూజిలాండ్లో పర్యటించి అక్కడి గవర్నర్ జనరల్, ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 10న తిమోర్-లిస్తే దేశాధ్యక్షుడు జోస్ రామోస్తో సమావేశమవుతారు.
Similar News
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.


