News July 30, 2024

5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వచ్చే నెల 5 నుంచి ఆరు రోజులపాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఫిజీ దేశానికి వెళ్లి అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 7 నుంచి 9 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించి అక్కడి గవర్నర్ జనరల్, ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 10న తిమోర్-లిస్తే దేశాధ్యక్షుడు జోస్ రామోస్‌తో సమావేశమవుతారు.

Similar News

News October 24, 2025

WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

image

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్‌ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్‌కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.

News October 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 24, 2025

బిహార్ ఎన్నికల్లో యువతదే కీలకపాత్ర: మోదీ

image

బిహార్‌లో ఆర్జేడీ ఆటవిక పాలన(జంగల్ రాజ్)పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతుందని PM మోదీ అన్నారు. ప్రతిపక్షాల దురాగతాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. ‘మేరా బూత్ సబ్‌సే మజ్ బూత్: యువ సంవాద్’ ఆడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గతంలో RJD చేసిన ఆకృత్యాలను నేటి యువతకు BJP నేతలు వివరించాలని సూచించారు. NDA పాలనలో బిహార్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.