News July 6, 2024
అసెంబ్లీ సీట్లు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఎంపీ వినోద్
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని.. ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందన్నారు. ఇవాళ జరిగే ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశంపై చర్చించాలన్నారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. ఏపీ, తెలంగాణలో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.
Similar News
News October 5, 2024
నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి N-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు.
News October 5, 2024
Project Flower గురించి తెలుసా?
ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధానికి దిగిన ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఒకప్పుడు పరస్పరం సహకరించుకున్నాయి. సైనిక సహకారం కోసం Project Flower పేరుతో 1977లో ఇరాన్-ఇజ్రాయెల్ కలసి పనిచేశాయి. నాటి ఇరాన్ షా మొహమ్మద్ రెజా రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ భారీగా అయిల్ వనరులు పొందింది. అయితే, ఈ ప్రాజెక్టు 1979లో Iranian Revolution- 1979 కారణంగా అర్ధాంతరంగా ముగిసింది.
News October 5, 2024
‘రాజా సాబ్’ టీమ్కు ప్రభాస్ సూచన?
మారుతి డైరెక్షన్లో ‘రాజా సాబ్’లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆయన లైనప్లో సలార్-2, స్పిరిట్, హను-ప్రభాస్, కన్నప్ప సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులోపే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీమ్కు ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మెజారిటీ షూట్ పూర్తయిన నేపథ్యంలో త్వరగానే మిగతా షూట్ కూడా కంప్లీట్ కావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి..