News September 20, 2024

తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 18, 2026

నర్సింగ్ పోస్టుల మెరిట్ లిస్ట్ రిలీజ్

image

TG: ప్రభుత్వాస్పత్రుల్లో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి రెండో మెరిట్ లిస్టును మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. 2,322 పోస్టులకు గాను 1:1.5 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెరిట్ లిస్ట్‌లో పేరున్న వారికి JAN 22 నుంచి FEB 7వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ వివరాలను అధికారిక <>వెబ్‌సైట్‌<<>>లో ఉంచింది.

News January 18, 2026

స్వర్గలోక ప్రాప్తి కోసం నేడు ఏం చేయలంటే?

image

చొల్లంగి అమావాస్య నాడు పితృదేవతలకు మోక్షం ప్రసాదించడానికి నదీ స్నానం చేయాలి. పితృ తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘నువ్వులు నింపిన రాగి పాత్రను, వస్త్రాలను, అన్నాన్ని పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. మౌనవ్రతం పాటిస్తూ శివారాధన చేయడం వల్ల సకల జాతక దోషాలు తొలగి పుణ్యగతులు లభిస్తాయి. రుద్రాభిషేకంతో మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాల ప్రదక్షిణ మంచిది’ అంటున్నారు.

News January 18, 2026

నేడు చొల్లంగి అమావాస్య.. ఈ ఒక్క పని చేస్తే!

image

ఈరోజు చొల్లంగి అమావాస్య. ఈ పవిత్ర దినాన తూ.గో(D) చొల్లంగి వద్ద ఉన్న సాగర సంగమంలో(గోదావరి నది) స్నానమాచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. నేడు నదీ స్నానాలు చేసి, పితృ తర్పణాలు వదిలితే వంశాభివృద్ధి, 21 తరాల పితృదేవతలకు నరక విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈరోజే సప్త సాగర యాత్ర మొదలవుతుంది. స్వర్గలోక ప్రాప్తి సిద్ధించడానికి నేడు ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.