News March 21, 2024
ఈడీ అరెస్టును అడ్డుకోండి.. హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేయగా, ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని, రక్షణ కల్పిస్తే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.
Similar News
News January 25, 2026
APPLY: టెన్త్ అర్హతతో 572 పోస్టులు

RBIలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో 36 పోస్టులున్నాయి. టెన్త్ పాసైన వారు అర్హులు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: rbi.org.in
News January 25, 2026
ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి: CS

AP: ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఓటు హక్కు వినియోగమే పునాది అని సీఎస్ విజయానంద్ చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘18 ఏళ్లు నిండిన వారు JAN 1, APR 1, JULY 1, OCT 1న ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. Form-8 ద్వారా చిరునామాను మార్చుకోవచ్చు. EPIC కార్డ్ ఉండటం వల్ల ఓటు హక్కు రాదు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో <
News January 25, 2026
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్న భారత్.. కానీ

ఇటీవల జపాన్ను దాటి నాలుగో స్థానానికి చేరిన భారత్, 2028లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. అయినా తలసరి ఆదాయం తక్కువగానే ఉంది. దీనికి కారణం 140 కోట్ల మందిపై GDP పంచుకోవాల్సి రావడం. అదే విధంగా దాదాపు 46% మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నా వారి ఆదాయం తక్కువగా ఉంది. 80% పైగా ఉద్యోగాలు సరైన గుర్తింపు లేనివి కాగా కేవలం IT, ఫినాన్స్ వంటి రంగాల్లోనే సంపద కేంద్రీకరణ అయి ఉంది.


