News March 21, 2024
ఈడీ అరెస్టును అడ్డుకోండి.. హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేయగా, ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని, రక్షణ కల్పిస్తే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.
Similar News
News September 13, 2025
కాంగోలో పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి

కాంగోలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు. ఈక్వేటార్ ప్రావిన్స్కు 150 కి.మీ దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి. గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 107 మంది మృతిచెందారు. 146 మంది గల్లంతు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం జరిగిన మరో ప్రమాదంలో మోటార్ పడవ బోల్తా పడి 86 మంది చనిపోయారు.
News September 13, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో TGలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ NML, NZB, కామారెడ్డి, MDK, సంగారెడ్డి జిల్లాల్లో, రేపటి నుంచి ఈ నెల 16 వరకు ADB, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, NZB భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అటు అల్పపీడన ప్రభావంతో APలోని ఏలూరు, NTR, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది.
News September 13, 2025
బీసీసీఐ అధ్యక్షుడిగా కిరణ్ మోరే?

BCCI తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు ఇందుకు పాజిటివ్గా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఎన్నికలు జరగకపోవచ్చని, ఏకగ్రీవం అయ్యే ఛాన్సుందని ఇటీవల IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా అభిప్రాయపడ్డారు. కిరణ్ మోరే IND తరఫున 49 టెస్టులు, 94 ODIలు ఆడారు. 1988, 1991 ఆసియా కప్ విన్నింగ్ టీమ్లో సభ్యుడిగా ఉన్నారు.