News September 5, 2025
ధరల తగ్గింపు.. ఓల్డ్ స్టాక్ పరిస్థితేంటి?

GST సంస్కరణలతో దాదాపు 400 రకాల గూడ్స్&సర్వీసెస్ రేట్లు ఈనెల 22 నుంచి తగ్గనున్నాయి. మరి ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటి రేట్లు తగ్గిస్తారా లేదా అన్న సందేహం నెలకొంది. అయితే ఈ సమస్యను కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లే ఎదుర్కొంటారని తెలుస్తోంది. GST తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలన్న కేంద్రం ఆదేశాలతో ధరల సర్దుబాటు ప్రక్రియ స్టార్ట్ చేసినట్లు సమాచారం. కొత్త రేట్ స్టిక్కర్తో విక్రయించే అవకాశముంది.
Similar News
News September 5, 2025
అద్భుతం.. బాలభీముడు పుట్టాడు!

మధ్యప్రదేశ్ జబల్పూర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.
News September 5, 2025
మహిళల WC: రూ.100కే టికెట్

మహిళల వన్డే WC టికెట్ల ధరను ICC రూ.100గా నిర్ణయించింది. ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు లీగ్ మ్యాచులకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సెప్టెంబర్ 30న మొదలయ్యే ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించేందుకు గువహటిలో సింగర్ శ్రేయా ఘోషల్తో గ్రాండ్గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీలంకతో పాటు భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. విశాఖలో OCT 9, 12, 13, 16, 26 తేదీల్లో మ్యాచులున్నాయి.
News September 5, 2025
గాజాలో 64వేలు దాటిన మరణాలు

గాజాలో మరణాల సంఖ్య 64వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇజ్రాయెల్ దాడుల్లో 28 మంది మరణించగా వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే 48 మంది బందీలను విడుదల చేస్తామన్న హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. యుద్ధంలో ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. 2023 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.