News April 25, 2024
వారసత్వ పన్ను వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ

మరణించిన వ్యక్తుల ఆస్తుల్ని కూడా కాంగ్రెస్ దోచుకుంటుందని PM మోదీ విమర్శించారు. వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన <<13113751>>వ్యాఖ్యలపై<<>> మండిపడ్డారు. ‘తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన సంపదపై పన్ను విధించాలని కాంగ్రెస్ అంటోంది. అలా చేస్తే ప్రజలు కష్టపడి సంపాదించిందంతా వారి పిల్లలకు దక్కదు’ అని ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
Similar News
News December 28, 2025
దానిమ్మ తోటలపై క్రాప్ కవర్ వల్ల లాభాలేమిటి?

కొన్నిచోట్ల దానిమ్మ చెట్లపై తెల్లని కవర్ గమనించే ఉంటారు. వీటినే క్రాప్ కవర్స్ అంటారు. వీటిని ప్లాస్టిక్+నైలాన్తో తయారు చేస్తారు. ఈ కవర్ వల్ల పండు ఈగ, ఇతర చీడపీడల నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. అలాగే మొక్క, కాయలపై అధిక ఎండ, చలి తీవ్రత పడకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమను నిలకడగా ఉంచి కలుపు బెడదను తగ్గిస్తుంది. ఫలితంగా తెగుళ్లు, మచ్చలు లేని నాణ్యమైన పంటతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు.
News December 28, 2025
150 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 28, 2025
ఉత్తర ద్వార దర్శన ప్రాముఖ్యత ఏంటి?

దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిదైన ధనుర్మాసంలో ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. స్వామివారు స్వయంగా ఉత్తర ద్వారం గుండా వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఆలయాల్లో ఉత్తర దిశగా ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేస్తారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని, సాక్షాత్తు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ పవిత్ర దర్శనం సకల పాపాలను హరించి, అష్టైశ్వర్యాలను, శాంతిని ప్రసాదిస్తుంది.


