News March 23, 2024
ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ
రష్యాలోని మాస్కోలో జరిగిన దారుణమైన <<12907109>>ఉగ్రదాడిని<<>> ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ‘ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు ఇండియా సంఘీభావం తెలుపుతోంది. బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఉగ్రదాడిలో 62 మంది మరణించగా, 100 మందికి పైగా పౌరులు గాయపడ్డారు.
Similar News
News October 2, 2024
MUDA SCAM: బాపూజీ ధైర్యమిస్తున్నాడన్న సిద్దరామయ్య
ముడా స్కామ్, ED నోటీసులు, లోకాయుక్త కేసులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బాపూ జీవితం, ఆయన ఆలోచనలే తనకు ధైర్యం ఇస్తున్నాయని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మతతత్వం, నియంతృత్వం, హింసతో నిండిన ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ, సత్య స్వరూపం, శాంతి, అహింసే మన చేతిపట్టి నడిపిస్తాయి’ అని ట్వీట్ చేశారు. ఆయనపై లోకాయుక్త FIR, ఈడీ ECIR రిజిస్టర్ చేయడం తెలిసిందే.
News October 2, 2024
సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశాం: సురేఖ
TG: తనపై ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక్కడి 3, దుబాయ్ నుంచి మరో 3 ఖాతాల ద్వారా ట్రోల్ చేశారన్నారు. ‘ఐదేళ్లు BRSలో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. మా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. ఈ ఘటనపై KTR ఎందుకు స్పందించలేదు? ఆయనకు మనుషుల అనుబంధాల విలువ తెలుసా?’ అని ప్రశ్నించారు.
News October 2, 2024
ICC నం.1 టెస్టు బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా
బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. 870 పాయింట్స్తో బుమ్రా నం.1 టెస్టు బౌలర్గా నిలిచారు. ఇప్పటివరకు నం.1గా ఉన్న అశ్విన్ రెండో స్థానానికి పడిపోయారు. అశ్విన్ కూడా బంగ్లాతో టెస్టు సిరీస్లో 11 వికెట్లు తీయడం గమనార్హం.