News August 26, 2024
బైడెన్కు ప్రధాని మోదీ ఫోన్

అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కాసేపటి క్రితం ఫోన్ సంభాషణ జరిగింది. ఇటీవల నెలరోజుల వ్యవధిలో యుద్ధంలో తలపడుతున్న రష్యా, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లి వచ్చిన మోదీ ఆ వివరాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. బైడెన్ పదవీ కాలం కొన్ని నెలల్లో ముగుస్తుండడంతో మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.
Similar News
News January 24, 2026
అభిషేక్ కెరీర్లో తొలి గోల్డెన్ డక్

భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ కెరీర్లో తొలిసారి గోల్డెన్ డక్ నమోదు చేసుకున్నారు. NZతో జరుగుతున్న రెండో T20లో తొలి బంతికే అవుటై అభిమానులను నిరాశపరిచారు. జాకబ్ డఫీ వేసిన బంతిని ఆడబోయి కాన్వేకు క్యాచ్ ఇచ్చారు. ఇది అభిషేక్కు T20Iల్లో రెండో డక్. 2024లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో (డెబ్యూ) తొలిసారి డకౌట్ అయ్యారు. మొత్తంగా ఐపీఎల్తో కలిపి టీ20ల్లో 10 సార్లు 0 పరుగులకే వెనుదిరిగారు.
News January 24, 2026
LRS దరఖాస్తు గడువు పొడిగింపు

AP: అనధికార లేఅవుట్ల <<18905073>>రెగ్యులరైజేషన్కు<<>> విధించిన గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రూ.10వేలు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు 61,947 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం LRS దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.
News January 23, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్(82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.


