News March 17, 2024
గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1709512094029-normal-WIFI.webp)
AP: ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న ప్రజాగళం బహిరంగసభకు కాసేపట్లో హాజరుకానున్నారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Similar News
News July 5, 2024
BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720933707-normal-WIFI.webp)
TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్రాజ్ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.
News July 5, 2024
చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720175636334-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
News July 5, 2024
మా పిల్లలకు కోహ్లీ, రోహిత్ గురించి చెప్తాం: ఫ్యాన్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720167081748-normal-WIFI.webp)
టీ20 వరల్డ్ కప్-2024 గెలవడంలో కీలకంగా వ్యవహరించి T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ చరిత్రలో నిలిచిపోతారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ‘క్రికెట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా తండ్రులు సచిన్, గంగూలీ గురించి చెప్పేవారు. మేము మా పిల్లలకు లెజెండ్స్ రోహిత్, కోహ్లీల గురించి చెప్తాం’ అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వీరి రిటైర్మెంట్తో ఓ శకం ముగిసిందంటున్నారు. మీరేమంటారు?