News January 10, 2025

మెలోడీతో మీమ్స్.. స్పందించిన ప్రధాని మోదీ

image

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తాను కలిసి ఉన్న ‘మెలోడీ’ మీమ్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘అది ఎప్పుడూ జరిగేదే. దాని గురించి ఆలోచించి నా సమయం వృథా చేసుకోను’ అని ఆయన చెప్పారు. WTF సిరీస్‌లో భాగంగా జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో మోదీ మాట్లాడారు. అలాగే తన చిన్నప్పుడు ఇంట్లో వారి బట్టలన్నీ తానే ఉతికేవాడినని చెప్పారు.

Similar News

News January 20, 2026

ఏకైక ప్లేయర్‌గా జకోవిచ్ రికార్డు

image

ఆస్ట్రేలియన్ ఓపెన్‌(టెన్నిస్)లో తొలి రౌండ్‌లో గెలుపుతో 100 విజయాలు పూర్తి చేసుకున్న జకోవిచ్ అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌(సింథటిక్)తో పాటు వింబుల్డన్(గ్రాస్), ఫ్రెంచ్ ఓపెన్(మట్టి).. మూడు గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో 100 చొప్పున మ్యాచులు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ఈ టోర్నీలో టైటిల్ గెలిస్తే 25 మేజర్ ట్రోఫీలు నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నారు.

News January 20, 2026

అతి శక్తమంతమైన ‘హనుమాన్ గాయత్రీ మంత్రం’

image

‘‘ఓం ఆంజనేయాయ విద్మహే.. వాయుపుత్రాయ ధీమహి.. తన్నో హనుమత్ ప్రచోదయాత్’’
ఈ ఆంజనేయ గాయత్రీ మంత్రం అత్యంత శక్తిమంతమైనది. దీన్ని ధైర్యం, భక్తిని పెంపొందించుకోవడానికి రోజూ భక్తితో 11 సార్లు జపించాలని పండితులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా దీన్ని పారాయణ చేస్తే ఆంజనేయుడి అనుగ్రహంతో అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. భయం పోయి మనోధైర్యం కలగడానికి ఇదో అద్భుతమైన మార్గం.

News January 20, 2026

రాష్ట్రంలో పశువులకు బీమా పథకం ప్రారంభం

image

AP: పశువుల అకాల మరణంతో రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం పశు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రీమియం మొత్తంలో ప్రభుత్వం 85% భరించనుండగా రైతు 15% చెల్లించాలి. మేలు జాతి పశువులకు ₹30,000, నాటు పశువులకు ₹15,000 వరకు కవరేజీ ఉంటుంది. ఈ నెల 31 వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో రైతులు నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.