News August 24, 2024
ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ రెండు దేశాల పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. మొదట పోలాండ్కు వెళ్లిన మోదీ 45 ఏళ్లలో అక్కడ పర్యటించిన భారత తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత రైలులో ఉక్రెయిన్కు వెళ్లి జెలెన్ స్కీని ఓదార్చారు. బాలల స్మారకాన్ని సందర్శించారు. మానవతా సాయం కింద వైద్య పరికరాలు అందించారు.
Similar News
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.
News December 6, 2025
7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.
News December 6, 2025
‘కింగ్’ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తారా?

విశాఖ వేదికగా IND-SA మధ్య ఇవాళ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి. అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.


