News July 30, 2024

కేరళ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

image

కేరళలో కొండచరియలు విరిగిపడిన <<13735967>>ఘటనపై<<>> ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్‌తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు Xలో పేర్కొన్నారు.

Similar News

News February 7, 2026

ఏపీలో చిక్కింది.. తెలంగాణలో సెర్చింగ్!

image

తెలుగు రాష్ట్రాలను కొన్ని రోజులుగా పెద్దపులులు భయపెడుతున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జనాలను భయాందోళనలకు గురిచేసిన పెద్దపులి నిన్న అధికారులకు చిక్కింది. మరోవైపు తెలంగాణ జనగాంలోని రఘునాథపల్లిలో మరో పెద్దపులి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా లేగదూడను చంపిన ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 7, 2026

ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల గూడ్స్‌.. US నుంచి ఇండియాకు!

image

వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి ఏకంగా 500 బిలియన్ డాలర్ల గూడ్స్‌ను ఇండియా కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధన ఉత్పత్తులు, ఎయిర్‌క్రాఫ్టులు, వాటి పార్టులు, విలువైన లోహాలు, టెక్నాలజీ ప్రొడక్టులు, కోకింగ్ కోల్ వంటివి ఉన్నాయి. డేటా సెంటర్లలో ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU)తో పాటు ఇతర టెక్నాలజీ ప్రొడక్టుల వాణిజ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

News February 7, 2026

IND-US మధ్య కుదిరిన ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్

image

IND-US మధ్య ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్‌ ఖరారైనట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను 18%కి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసేందుకు భారత్ అంగీకరించిందని ఫ్రేమ్ ‌వర్క్‌లో పేర్కొంది. US నుంచి ఇంధనం, గ్యాస్‌ను భారత్ దిగుమతి చేసుకోనున్నట్టు చెప్పింది. అమెరికా దిగుమతి చేసుకునే వాటిపై సుంకాలను IND సున్నాశాతానికి తగ్గిస్తుందని తెలిపింది.