News July 30, 2024
కేరళ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కేరళలో కొండచరియలు విరిగిపడిన <<13735967>>ఘటనపై<<>> ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు Xలో పేర్కొన్నారు.
Similar News
News February 1, 2025
BUDGET 2025-26: కీలకాంశాలు
* ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
* అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు
* స్టార్టప్స్ మొదలైననాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు
* 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
* బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు
* పదేళ్లలో 100 స్థానిక ఎయిర్పోర్టుల నిర్మాణం
* వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
* 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
* కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు
News February 1, 2025
అప్పుడు.. ఇప్పుడు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుంచి వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆరు సార్లు రెగ్యులర్ బడ్జెట్, ఒక మద్యంతర బడ్జెట్ను సమర్పించగా నేడు ఎనిమిదో సారి ప్రసంగించారు. ప్రతిసారి సంప్రదాయ చీరకట్టులో ఎరుపు రంగు వస్త్రంలో ఉంచిన కాపీలు/ట్యాబ్తో ఆమె పార్లమెంట్కు రావడం విశేషం. ఇన్నేళ్లుగా ఒకే వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండటంతో ఇండియన్ బడ్జెట్ను.. ‘నిర్మలమ్మ బడ్జెట్’ అని ప్రజలు పిలుస్తుంటారు.
News February 1, 2025
అద్దె, పింఛన్లపై టీడీఎస్, టీసీఎస్ పరిమితి పెంపు
అద్దెలపై విధించే TDS వార్షిక పరిమితిని రూ.2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. ఇక పింఛన్ల వడ్డీపై TDS, TCS మినహాయింపును ప్రస్తుతమున్న రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ‘LRSపై ఉన్న TCS పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నాం. విద్యాసంబంధిత రుణాల్లో టీసీఎస్ను రూ.10 లక్షల వరకూ తొలగించాలని ప్రతిపాదన తీసుకురానున్నాం’ అని స్పష్టం చేశారు.