News December 18, 2024
21న ప్రధాని మోదీ కువైట్ పర్యటన

ఈ నెల 21, 22 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్లో పర్యటిస్తారు. ఆ దేశ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కువైట్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో ఆయన భేటీ అవుతారు. కాగా కువైట్ను చివరిసారి 1981లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సందర్శించారు. మళ్లీ 43 ఏళ్ల తర్వాత మోదీ అక్కడికి వెళ్తున్నారు. కువైట్లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.
Similar News
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
News November 14, 2025
ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట

ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ లేకుంటే టోల్ ప్లాజాల వద్ద ఫీజు రెండింతలు చెల్లించాలి. ఇప్పుడు ఆ నిబంధనను మార్చారు. UPI ద్వారా చెల్లిస్తే అదనంగా 25% కడితే సరిపోతుంది. నగదు చెల్లింపులకు మాత్రం రెట్టింపు ఫీజు తీసుకుంటారు. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు (నవంబర్ 15) తెల్లవారుజాము నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.


