News February 4, 2025

రేపు మహాకుంభమేళాకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ రేపు(FEB 5) ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమం వద్ద ఆయన పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. అటు రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మహాకుంభమేళాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Similar News

News February 4, 2025

‘అల వైకుంఠపురంలో’ తమిళ మూవీ అన్న పూజ.. నెటిజన్ల ఫైర్

image

అల్లు అర్జున్, తాను కలిసి నటించిన ‘అల వైకుంఠపురంలో’.. తమిళ సినిమా అని పూజా హెగ్డే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అది తమిళ సినిమా అయినా హిందీ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారని ‘దేవా’ మూవీ ప్రమోషన్లలో పూజ కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేశారని, అంత పెద్ద హిట్ అయిన సినిమానే మర్చిపోతారా? అని ఫ్యాన్స్ పూజపై మండిపడుతున్నారు.

News February 4, 2025

మూడేళ్ల కిందటే మోనాలిసాకు ఫొటోషూట్

image

తేనెకళ్ల సుందరి మోనాలిసాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో ‘పరికర్మ’ మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలను సంజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్‌’లో నటిస్తున్నారు.

News February 4, 2025

సాధువులకు బట్టలు లేకున్నా చలి పెట్టదు.. ఎందుకంటే?

image

ప్రయాగ్‌రాజ్‌లో గడ్డ కట్టే చలిలోనూ అఘోరాలు, నాగ సాధువులు ఒంటిపై నూలు వస్త్రం కూడా లేకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై నాగసాధువులు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘సాధన చేసినప్పుడు చలి అనేదే ఉండదు. బూడిదను శరీరానికి రాసుకుంటాం కాబట్టి చలి తక్కువేస్తుంది. దీనివల్ల రోగాలు కూడా రావు. జపం చేయడం, భగవంతుడిని ప్రార్థించడమే అతిపెద్ద వస్త్రం. ఇంకేం వస్త్రాలు అక్కర్లేదు’ అని తెలిపారు.

error: Content is protected !!