News March 19, 2024

11 ఏళ్ల విద్యార్థినితో ప్రధాని మోదీ.. ఎందుకంటే?

image

తెలంగాణ పర్యటనలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ సభల్లో ప్రసంగించడంతో పాటు కొంత సమయాన్ని ఓ విద్యార్థిని అభినందించడానికి కేటాయించారు. హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న 11 ఏళ్ల ఆకర్షణ అనే విద్యార్థిని మోదీ అభినందించారు. ఆమె ఇప్పటివరకూ 10 లైబ్రరీలను ఏర్పాటు చేయగా.. 25వ లైబ్రరీ ప్రారంభించేందుకు తాను వస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆమెకు మోదీ సూచించారు.

Similar News

News January 31, 2026

‘దశరథ గడ్డి’ని ఎలా సాగు చేయాలి?

image

దశరథ గడ్డి(హెడ్జ్ లూసర్న్) పాడి పశువులకు, జీవాలకు మేలు చేసే బహువార్షిక పప్పుధాన్యపు గడ్డి. ఇందులో మాంసకృత్తులు, ప్రొటీన్లు, ఫైబర్, లిగ్నిన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. ఎకరాలో సాగుకు 10kgల విత్తనాలు సరిపోతాయి. కేజీ విత్తనానికి కేజీ ఇసుకను కలిపి వేయాలి. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు దశరథ గడ్డి సాగుకు పనికిరావు. ఒక హెక్టారుకు 90-100 టన్నుల పశుగ్రాసం వస్తుంది.

News January 31, 2026

2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ.. CCTVల నిఘాలో పరీక్షలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు 1,440 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5 గంటల మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అన్ని సెంటర్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సైన్స్ స్ట్రీమ్ నుంచి 4 లక్షలు, వొకేషనల్ నుంచి లక్ష మంది హాజరవుతారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

News January 31, 2026

ఉపగ్రహాలతో అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటుకు మస్క్ సిద్ధం!

image

స్పేస్‌ఎక్స్ సరికొత్త చరిత్రకు సిద్ధమైంది. అంతరిక్షంలో ఏకంగా పది లక్షల ఉపగ్రహాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఏఐ డేటా సెంటర్‌’ను నిర్మించనుంది. నిరంతర సౌరశక్తి, లేజర్ టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా AI కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడమే దీని లక్ష్యమని మస్క్ తెలిపినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే భూమిపై ఖర్చు తగ్గడమే కాకుండా డేటా ప్రాసెసింగ్ వేగం పెరుగుతుందని సమాచారం.