News March 19, 2024
11 ఏళ్ల విద్యార్థినితో ప్రధాని మోదీ.. ఎందుకంటే?

తెలంగాణ పర్యటనలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ సభల్లో ప్రసంగించడంతో పాటు కొంత సమయాన్ని ఓ విద్యార్థిని అభినందించడానికి కేటాయించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 11 ఏళ్ల ఆకర్షణ అనే విద్యార్థిని మోదీ అభినందించారు. ఆమె ఇప్పటివరకూ 10 లైబ్రరీలను ఏర్పాటు చేయగా.. 25వ లైబ్రరీ ప్రారంభించేందుకు తాను వస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆమెకు మోదీ సూచించారు.
Similar News
News April 3, 2025
ముస్లింలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు: రాహుల్

దేశంలోని ముస్లింలను అణచివేసి, వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకునే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. భవిష్యత్లో దీనిని ఇతర వర్గాలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది దేశ ఆలోచనలపై దాడి చేస్తుంది’ అని ఆయన ఎక్స్లో తీవ్ర విమర్శలు చేశారు.
News April 3, 2025
ఆల్టైమ్ రికార్డును సమం చేసిన భువీ

RCB స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్టైమ్ రికార్డును సమం చేశారు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా ఘనత సాధించారు. ఇప్పటివరకు ఆయన 183 వికెట్లు తీసి డ్వేన్ బ్రావో రికార్డును భువీ సమం చేశారు. గుజరాత్తో జరిగిన మ్యాచులో స్వింగ్ కింగ్ ఈ ఫీట్ సాధించారు. అలాగే IPL చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ ఆయన కొనసాగుతున్నారు. టోర్నీ పవర్ ప్లేలో ఇప్పటివరకు 73 వికెట్లు పడగొట్టారు.
News April 3, 2025
HCU వివాదంపై స్పందించిన రష్మిక మందన్న

HCU (హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ) వివాదంపై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇందుకు సంబంధించి ఆమె తన SM ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘రాత్రికి రాత్రే జేసీబీలు, బుల్డోజర్లు.. విద్యార్థుల అరెస్టులు.. HCUలో అసలేం జరుగుతోంది. ఇప్పుడే ఈ విషయం తెలిసింది. నా హృదయం ముక్కలైనట్లు ఉంది. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది’ అంటూ రష్మిక రాసుకొచ్చారు. కాగా హెచ్సీయూలో 400 ఎకరాల భూవివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.