News June 13, 2024
మెగా ఫ్యామిలీతో ప్రధాని మోదీ

ప్రధాని మోదీతో మెగా బ్రదర్స్ గ్రూప్ ఫొటో దిగారు. నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ ఆ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోకు పోజులిచ్చారు. ఈ చిత్రం తాజాగా బయటకి రావడంతో మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ వేదికపైనా చిరంజీవి, పవన్ను మోదీ ఆత్మీయంగా హత్తుకున్న విషయం తెలిసిందే.
Similar News
News September 15, 2025
షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం బాధించింది: పాక్ కోచ్

మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు <<17712244>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని పాక్ కోచ్ మైక్ హెసన్ అన్నారు. వారి కోసం గ్రౌండ్లో తాము చాలాసేపు ఎదురుచూశామని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఈ మ్యాచులో తమ ప్రదర్శన కూడా ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు. కాగా నిన్న భారత ప్లేయర్స్ పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని విషయం తెలిసిందే. టాస్ టైమ్లోనూ పాక్ కెప్టెన్తో సూర్య చేతులు కలపలేదు.
News September 15, 2025
GSTని తగ్గించిన కేంద్రం.. ప్రీమియం పెంచేస్తున్న కంపెనీలు!

కేంద్రప్రభుత్వం బీమా ప్రీమియంపై జీఎస్టీని 18% నుంచి సున్నాకు తగ్గించినా ప్రజలకు ఆ మేర లబ్ధి చేకూరట్లేదు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 3 నుంచి 5 శాతం వరకు ప్రీమియాన్ని పెంచేశాయి. సెప్టెంబర్ 16 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తన కంపెనీ ప్రకటించినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలు అందట్లేదు. అంతిమంగా 13% వరకే ఆదా కానున్నాయి.
News September 15, 2025
వెంటనే రూ.10వేల కోట్లు విడుదల చేయండి: సబిత

TG: విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయండి. మేము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదు’ అని ట్వీట్ చేశారు.