News March 17, 2025

‘ట్రూత్ సోషల్’లో ప్రధాని మోదీ.. తొలి పోస్ట్ ఇదే

image

ట్రంప్ మీడియా&టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో భారత ప్రధాని మోదీ జాయిన్ అయ్యారు. ఈ వేదికపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన తన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసినందుకు US ప్రెసిడెంట్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తన ప్రకటనలు ఎక్కువగా ‘ట్రూత్ సోషల్’లోనే చేస్తారన్న సంగతి తెలిసిందే.

Similar News

News March 18, 2025

రేపటి నుంచి POLYCET దరఖాస్తుల స్వీకరణ

image

TG: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే POLYCET-2025 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ఏప్రిల్ 19 వరకు జరగనుంది. మే 13న ఎగ్జామ్ జరగనుండగా, పరీక్ష జరిగిన 12 రోజులకు ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500గా ఉంది. సందేహాలకు 08031404549 నంబర్‌లో సంప్రదించండి.
వెబ్‌సైట్: https://polycet.sbtet.telangana.gov.in/

News March 18, 2025

ఈ సీజన్ ఐపీఎల్ విజేత ఎవరు?

image

క్రికెట్ అభిమానులను అలరింపజేసేందుకు IPL సిద్ధమవుతోంది. ఈ సీజన్లో బలాబలాలను బట్టి గెలిచే జట్టేదో నెటిజన్లు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్ లైనప్ ప్రకారం SRH గెలుస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే అన్ని కోణాల్లో చూస్తే బెస్ట్ కెప్టెన్ రోహిత్, నంబర్ 1 బౌలర్ బుమ్రా, నంబర్ 1 ఆల్ రౌండర్ పాండ్య, స్టార్ బ్యాటర్లు సూర్య, తిలక్‌లు ఉన్న ముంబైదే ట్రోఫీ అని మరికొందరు అంటున్నారు. గెలిచే జట్టేదో కామెంట్ చేయండి.

News March 18, 2025

సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్‌మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్‌‌లో నియమిస్తారు.

error: Content is protected !!