News October 11, 2025
ఏపీకి ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

AP: ప్రధాని మోదీ ఈనెల 16న 7.50AMకు ఢిల్లీ నుంచి బయల్దేరి 10.20AMకు కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11.10AMకు రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి 11.45AMకు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. 2.30PMకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు శంకుస్థాపన చేస్తారు. 4PMకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4.40PMకు కర్నూలు ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.
Similar News
News October 12, 2025
డ్రోన్ దాడుల్లో 60 మంది మృతి!

ఆఫ్రికా దేశం సూడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ రెచ్చిపోయాయి. నార్త్ డార్ఫర్ సిటీలోని షెల్టర్పై జరిపిన డ్రోన్ దాడుల్లో 60 మంది వరకు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే సగానికి పైగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2023 నుంచి ఆర్మీతో పారామిలిటరీ ఘర్షణలు కొనసాగిస్తోంది. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
News October 12, 2025
ప్రతి కుటుంబానికి మెరుగైన జీవనోపాధే లక్ష్యం: చంద్రబాబు

AP: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని CM CBN తెలిపారు. NLRలో స్మార్ట్ స్ట్రీట్ను వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. ‘రూ.7కోట్లతో ఈ దుకాణాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ దుకాణాలు పొంది 120మంది ఎంట్రప్రెన్యూర్లయ్యారు. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు వీటిని కేటాయించాం. ప్రతి ఇంటా చిరు వ్యాపారమో, చిరు పరిశ్రమనో స్థాపించేలా చూస్తున్నాం’ అని వివరించారు.
News October 11, 2025
నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్: CBN

AP: నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్శాఖపై సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా మద్యం బాటిల్పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఫైరయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని తెలిపారు.