News April 15, 2025

మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

image

AP: ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2న రాజధాని పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన పనులు మోదీ చేత శంకుస్థాపన చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మోదీ పర్యటన వివరాలను వెల్లడించారు. అలాగే మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రులకు CM దిశానిర్దేశం చేశారు.

Similar News

News November 25, 2025

డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగ్ కుంగిన ఘటనపై విచారణకు ఆదేశం

image

వేములవాడ శివారులోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగు కుంగిన ఘటనపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ తెలిపారు.

News November 25, 2025

డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగ్ కుంగిన ఘటనపై విచారణకు ఆదేశం

image

వేములవాడ శివారులోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగు కుంగిన ఘటనపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ తెలిపారు.

News November 25, 2025

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

image

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్‌బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.