News April 15, 2025
మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

AP: ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2న రాజధాని పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన పనులు మోదీ చేత శంకుస్థాపన చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మోదీ పర్యటన వివరాలను వెల్లడించారు. అలాగే మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రులకు CM దిశానిర్దేశం చేశారు.
Similar News
News April 17, 2025
BREAKING: డీఎస్సీకి వయోపరిమితి పెంపు

AP: రాష్ట్రంలో డీఎస్సీ-2025కి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
News April 17, 2025
ఆ స్టార్ హీరోకు 17 ఏళ్లలో బిగ్గెస్ట్ ఫ్లాప్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు చవిచూస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్లో రష్మిక హీరోయిన్గా భారీ అంచనాలతో మార్చి 30న విడుదలైన ‘సికందర్’ ఫ్యాన్స్ను మెప్పించలేకపోయింది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రూ.177 కోట్లే వసూలు చేసిందని సినీ వర్గాలు తెలిపాయి. యువరాజ్(2008) తర్వాత సల్మాన్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఫ్లాప్ అని పేర్కొన్నాయి.
News April 17, 2025
SRH స్కోర్ ఎంతంటే?

ముంబైతో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(40), క్లాసెన్(37) ఫర్వాలేదనిపించినా హెడ్(29 బంతుల్లో 28), నితీశ్(19), కిషన్(2) విఫలమయ్యారు. ఓ దశలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో SRH బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. చివర్లో అనికేత్ 8 బంతుల్లో 18 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదైంది. విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు. MI టార్గెట్ 163.